- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉండడానికి గూడులేని, నిరుపేదలకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తోందని మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ తెలిపారు. గురువారం మంత్రి శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ క్రాంతి కుమార్, ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ఏఈ రంజిత్, ఉప సర్పంచ్ లకవత్ సవేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



