నిషేధిత గుట్కాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  
ప్రభుత్వ నిషేధిత రూ. 9 వేల రూపాయల విలువ గల గుట్కాలను శనివారం హుస్నాబాద్ పట్టణంలో  మహేశ్వర హోల్ సేల్ కిరాణా షాప్ లో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గౌరిశెట్టి రవీందర్  నిషేధిత గుట్కాలు అమ్ముతున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, హుస్నాబాద్  పోలీసులు మహేశ్వర హోల్ సేల్ కిరాణా షాప్ లో తనిఖీలు నిర్వహించారు .ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్, బ్లూబుల్, మరియు గుట్కా ప్యాకెట్లు బ్లాక్ సిగరెట్స్  స్వాధీనం చేసుకుని ఎస్ ఐ తోట మహేష్  కేసు నమోదు చేశాడు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక,  పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించిన గుట్కాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు .గ్రామాలలో,పట్టణాలలో ఇసుక, అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్నా రవాణా చేసిన  మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
Spread the love