ఏపీలో టీడీపీ కూటమి అధిక్యం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 100కి పైగా స్థానాలతో ఆధిక్యంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి… లోక్ సభ స్థానాల్లోనూ దూసుకుపోతోంది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా… కూటమి 20 స్థానాల్లో ముందంజ వేసింది. వైసీపీ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ 15, బీజేపీ 3, జనసేన 2, వైసీపీ 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హిందూపురం పార్లమెంటు స్థానంలో తొలుత వెనుకబడిన టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి… మళ్లీ పుంజుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆధిక్యం 3,261 ఓట్లకు పెరిగింది.

Spread the love