నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ వేసేందుకు సంబంధిత ఆర్వో కార్యాలయానికి వెళ్లి లైన్లో ఉన్న అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతించారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.