తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ పర్యటన

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.   కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏపీ వేదికగా ఎలాంటి కామెంట్లు చేస్తారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏమైనా విమర్శలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Spread the love