కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. గురువారం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత
మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ప్రజా తీర్పును గౌరవించి తన పదవికి రాజీనామా చేసి ఆదర్శ నాయకుడు,
ఎలాంటి లాంఛనాలు లేకుండా సాదాసీదాగా ఇంటికి వెళ్లిన గొప్ప నేత కేసీఆర్ అన్నారు.కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేయాలన్నారు.దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు.ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, రణం శ్రీనివాస్ గౌడ్, నరేందర్రెడ్డి, తొగుట వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.