ఏపీలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి ఎంపిక

నవతెలంగాణ – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు నిర్వహించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలేఖ్య (24) ప్రథమ స్థానం సాధించారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్‌కుమార్‌ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్‌ పెండేకంటి కళాశాలలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణురాలయ్యారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకొని తానూ జడ్జి కావాలనుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నియామకాల్లో అలేఖ్య ప్రథమ స్థానంలో నిలిచి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్‌, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు.

Spread the love