నవతెలంగాణ హైదరాబాద్: , పీజీ ఎల్ సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఓయూ వీసీ ఆచార్య రవీందర్ విడుదల చేశారు. తెలంగాణలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,218మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 25,747మంది పోటీ పడ్డారు.