ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..!

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి సంఘాలు. లోపలికి వెళ్ళే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి ,విద్యార్థి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్టేడియం మెయిన్ గేటు వద్ద బైఠాయించారు ఏఐవైఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నాయకులు.  అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో టికెట్ల విషయంలో బ్లాక్ గంద కొనసాగుతుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యప్రసాద్ ఆరోపించారు. ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ స్టేడియం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లకాడ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70 వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. దీంతో క్రికెట్ అభిమానులు తమకు టికెట్లు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.

Spread the love