నా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు 

– జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి  దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ-  మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాతో గత 20 రోజులుగా కలిసి నడిచిన, నాకోసం అహర్నిశలు కృషి చేసిన మంథని నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని,అన్ని గ్రామాల, పల్లెల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళ నాయకురాళ్లు, యూత్ నాయకులకు,కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియనట్టుగా జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా నవ తెలంగాణతో మాట్లాడారు డిసెంబర్ 3న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గొప్పగా ఆశీర్వదిస్తారని, తెలంగాణ రాష్ట్రంలో 75 నుంచి 80 ఎమ్మెల్యే సీట్లు గెలుసుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అన్ని వర్గాల ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చామని, అధికారం చేపట్టిన వందరోజుల్లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేస్తామన్నారు.
Spread the love