అభివృద్ధికి సహకరించిన సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు

 

– ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
తన ఐదు సంవత్సరాల పదవి కాలంలో మండలంలో అభివృద్ధికి సహకరించిన తోటి ఎంపీటీసీ సభ్యులకు, అధికారులకు ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు  గౌతమి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి అధ్యక్షతన చివరి మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎంతో కృషి చేశామన్నారు. ఇందుకు సహకరించిన  తోటి ఎంపీటీసీ సభ్యులకు, మండల జిల్లా స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలు శాఖల అధికారులు మండల సాధారణ  సర్వసభ్య సమావేశానికి గైర్హాజర్  కావడం పట్ల ఎంపీపీ, సభ్యులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.మూడు నెలలకు ఒక మరో జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా అధికారులు గైర్హాజరు కావడం సరైంది కాదని ఈ సందర్భంగా ఎంపీపీ పేర్కొన్నారు. విద్యుత్ పై జరిగిన సమీక్ష సమావేశంలో మండలంలో తరచు విద్యుత్ అంతరాయం కలగడం పట్ల ట్రాన్స్కో ఏఈ బాలరాజ్ ను సభ్యులు ప్రశ్నించారు. లో వోల్టేజ్ మూలంగా ఇండ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యల తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏఈ కి సూచించారు. సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కాలేరు శేఖర్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love