భారత్ ను విశ్వవిజేతగా నిలిపిన ఆ క్యాచ్..

నవతెలంగాణ – హైదరాబాద్: 2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భం. ఈ ప్రపంచకప్‌లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్‌ను సూర్యకుమార్‌ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్‌ వేసిన తొలి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. అది సిక్సర్‌ వెళ్లేలా కనిపించింది. అది కానీ బౌండరీ దాటి బయట పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! కానీ వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ పట్టిన సూర్య టీమ్‌ఇండియా విజయంలో కీలకమయ్యాడు.

Spread the love