రేపు కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

నవతెలంగాణ హైదరాబాద్: రేపు హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
(Mallikarjuna Kharge ), అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ఖర్గే చేరుకొనున్నారు. ఉదయం 11 గంటలకు ఖర్గే గాంధీభవన్‌కు చేరుకుంటారు. 11 గంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొననున్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌‌ ఓ హోటల్‌లో బస చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగుళూరు వెళ్లనున్నారు.

Spread the love