ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన జిల్లా వైద్యాధికారి

నవతెలంగాణ –  భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధి మళ్లీ వ్యాప్తి చెందుతున్నందున గ్రామాలలో ప్రజలకు కరోనా వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలో కోవిడ్ టెస్ట్ కిడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, సరైన వైద్య సదుపాయాలను పరిశీలించి అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు యేమిమా, ఆదర్శ్, కంటి వైద్యాధికారి లింబాద్రి, హెచ్ ఈ ఓ వెంకటరమణ, ల్యాబ్ టెక్నీషియన్ లతీఫ్, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
Spread the love