కంకర వేశారు..బీటీ మర్చారు..!

– బీటీ నిర్మాణం చేపట్టాలని బీఎస్పీ విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రం నుండి చీలాపూర్ పల్లి,చీలాపూర్ గ్రామాల మీదుగా రేగులపల్లి గ్రామ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులపై అయా గ్రామాలకు చెందిన పలువురు శనివారం అగ్రహం వ్యక్తం చేశారు. కంకర వేశారు..బీటీ నిర్మాణం మర్చిపోయారని అయా గ్రామాల గ్రామస్తులు వాపోయారు. గత రెండేళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కంకర రోడ్డుపై వాహనాదారులు ప్రమాధాల భారిన పడుతున్నామని అవేదన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు గుత్తెదారుడిపై తగు చర్యలు తీసుకుని బీటీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు విజ్ఞప్తి చేశారు. అధికారులు రోడ్డు నిర్మాణ పనులపై అలసత్వం వహిస్తే బీఎస్పీ అధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని రాజమల్లు హెచ్చరించారు.
Spread the love