రామరాజ్యంలో నాజీ నమూనా

రెండవ ప్రపంచ యుద్ధనీడలో జర్మని నరమేధానికి పాల్పడింది. హిట్లర్‌ 60 లక్షల యూదులు, 10 లక్షల పోలండ్‌ పౌరులు, 2 లక్షల జిప్సీలు, 70 వేల వికలాంగ జర్మన్లు, లెక్కలేనంత మంది రాజకీయ ప్రత్యర్థులను చంపాడు. 1928లో జర్మన్‌ పార్లమెంటు రీచ్స్టాగ్‌లో నాజి పార్టీకి 2.6శాతం ఓట్లే ఉన్నాయి. 1929 మహామాంద్యంలో బ్యాంకులు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఉపాధులు ఊడాయి. మధ్యతరగతి నిరు పేదలయ్యారు. ఈ స్థితిలో నాజి అబద్ద ప్రచారం ప్రజల్లో ఆశలు పెంచింది. 1932కు 37శాతం ఓట్లు సాధించింది. హిట్లర్‌ జనాలను కుదిపాడు.”బలమైన దేశాన్ని నిర్మిస్తాను. పాతపాలక తప్పులను దిద్ది జర్మన్‌ గౌరవాన్ని పెంచుతాను. ఉద్యోగాలిచ్చి యువతకు భద్రత కల్పిస్తాను. జర్మనీ విరుద్ధవిదేశీ కుట్రలను పెకలిస్తాను. ”ఈ వాగాడం బర ప్రచారాలు హిట్లర్‌ను దేవదూతగా, రక్షకునిగా చిత్రించాయి. 30 జనవరి 1933న అధ్యక్షుడు హిండెన్బర్గ్‌ ఛాన్సలర్‌గా హిట్లర్‌ను చేశాడు. హిట్లర్‌ ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులు, వాక్‌, పత్రిక, సమావేశ స్వేచ్ఛలను కూల్చాడు. 28 ఫిబ్రవరి 1933 మతోన్మాద, 3 మార్చి 1933 తోడ్పాటు చట్టాలు హిట్లర్‌ను నియంతను చేశాయి. ఆర్థిక, సైనిక, న్యాయ వ్యవస్థలను హిట్లర్‌ స్వాధీన పర్చుకు న్నాడు. నిఘా, రక్షణ, పోలీసు, నిర్బంధ శాసన రహిత చిత్రహింసలు, సమీకరణ శిక్షాశిబిరాలతో సమాజాన్ని బంధించాడు. జర్మని భయంకర నేర రాజ్యంగా మారింది. 1938కి ఒకే ప్రజ, ఒకే సామ్రా జ్యం, ఒకే నాయకుడు నినాదం మిన్నంటింది.
హిట్లర్‌ నాటి సమాజంలో జర్మన్‌ ఆర్య జాతి అగ్రస్థానంలో, యూదులు అధమ స్థానంలో ఇత రులు మధ్యలో ఉన్నారు. యూదులకు డబ్బే దేవు డని, దాని కోసం ఏ నేరమైనా చేస్తారని ప్రచారం చేశాడు. స్వచ్ఛ జర్మన్‌ జాతి నిర్మాణానికి అవాంఛి తులను చంపాలన్నాడు. అపవిత్ర జర్మన్లకూ బతికే హక్కు లేదు.భారత మూలాల ఆదిమజాతి, నల్ల జాతి, రష్యన్లు, పోలండ్‌లు,యూదులు, మేధావులు, కమ్యూనిస్టులు నాసిరకంవారు. మానవత్వ అన ర్హులు. 1933-38 మధ్య యూదులను భయ పెట్టారు, పేదలను చేశారు, దేశీయత నుండి వేరు చేశారు. వారు దేశం వదిలి వెళ్ళారు. 1939- 1945 మధ్య పోలండ్‌లో సమీకరణ శిబిరాల్లో, విషవాయు గదుల్లో బంధించి చంపారు. జాతి శుద్ధత పరీక్షలో నెగ్గని పసిపిల్లలను అనాధ శరణా లయాలకు తరలించి కూడూనీళ్ళు ఇవ్వకుండా చంపారు. శుద్ధరక్త జర్మన్జాతీయులే పౌరులు. యూదులు, జర్మన్ల మధ్య వివాహాలు నిషేధం. వివాహేతర సంబంధాలు నేరం. యూదులు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు చెయ్యరాదు. ఆస్తులను అమ్మ రాదు. యూదుల ఆస్తులను, ప్రార్థనా స్థలాలను దోచుకున్నారు. కాల్చారు, ఆక్రమించారు. ఈ1938 నవంబర్‌ హత్యాకాండ పగిలిన అద్దాల రాత్రిగా పేరుమోసింది. యూదులు ఎదపై పసుపుపచ్చ నక్షత్ర గుర్తును ధరించాలి. ఈ గుర్తున్నవారి సంప దను లాక్కొని ఇరుకుగదుల్లో బంధించి చంపారు.
హిట్లర్‌కు యువతపై మతోన్మాద ఆసక్తి. వారికి నాజి భావజాలాన్ని బోధించి బలమైన నాజి సమాజాన్ని స్థాపించవచ్చని నమ్మాడు. పిల్లలను బడుల లోపల, బయటా నియంత్రించాడు. పాఠశాలలను పవిత్రీ కరించాడు. యూదులైన, తాను నమ్మని ఉపాధ్యాయులను తొలగించాడు. పిల్ల లను వేరుచేశాడు. జర్మన్లు, యూదులు ఒకచోట కూర్చోరాదు. కలిసి ఆడ రాదు. అవాంఛనీయ పిల్లలను అనగా యూదులు, వికలాంగులు, జిప్సీలను బడులనుండి వెలేశాడు. విషవాయు గదులకు పంపాడు. జర్మన్‌ విద్యా ర్థులకు నాజి విద్యా విధానంలో సుదీర్ఘ భావజాల శిక్షణ ఇప్పించాడు. పాఠ్య పుస్తకాలను తిరగ రాయించాడు. నాజి భావ సమర్థనకు జాతివాద శాస్త్రాలను ప్రవేశపెట్టాడు. గణితంలోనూ యూదు వ్యతిరేక ప్రచారం చేశాడు. పిల్లలను యూదు వ్యతి రేకులుగా, నమ్మకస్తులుగా, విధే యులుగా, హిట్లర్‌ను పూజించే వారిగా బోధనలు చేశా రు. క్రీడల్లోనూ పిల్లల మధ్య హింస, శతృత్వ ధోరణులను రేపాడు. ముష్టి యుద్ధం పిల్లలను మగలక్షణాలతో, ఉక్కు మనస్కు లుగా, బలంగా చేస్తుందని హిట్లర్‌ నమ్మకం. యువతలో జాతీయ వాదాన్ని నింపే బాధ్యతను యువ సంస్థలకు ఇచ్చాడు. పదేండ్ల పిల్లలు నాజి యువ బృందం జంగ్వోల్క్‌లో చేరాలి. 14 ఏండ్లకు నాజి యువ సంస్థ ‘హిట్లర్‌ యూత్‌’లో చేరాలి. అక్కడ యుద్ధ పూజ, హింసశతృత్వాల కీర్తి, ప్రజాస్వామ్య ఖండన, కమ్యూనిస్టులు, అవాంఛనీయులు, యూదులు, జిప్సీలపై ద్వేషం నేర్చుతారు. కఠిన భావజాల, భౌతిక శిక్షణల తర్వాత 18 ఏళ్లవారు శ్రామికసేవలో చేరతారు. అక్కడ సాయుధ దళాల్లో, నాజి సంస్థల్లో చచ్చే వరకు పనిచేయాలి. సంపూర్ణ శిక్షణ తర్వాత (క్రూర నియంతృత్వ) నాయకుడు ఫ్యూరర్ప్రాతినిధ్య రక్త పతాకం కిందనా శక్తియుక్తులను, బలాన్ని దేశరక్షకుడు హిట్లర్‌కు అంకితం చేస్తానని, ఆయన కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకు దేవుడు సాయం చేయాలని ప్రమాణం చేయాలి. నాజీ యూత్‌ లీగ్‌ను 1922లో స్థాపించారు. నాలుగేండ్ల తర్వాత హిట్లర్‌ యూత్‌గా మార్చారు. నాజి నియం త్రణలో యువ ఉద్యమాన్ని ఏకీకృతం చేయడానికి ఇతర యువ సంఘాలను రద్దుచేశారు. నిషేధించారు.
”మగవారి కంటే మహిళలు భిన్నమైన వారని పిల్లలకు నూరిపోస్తారు.ప్రజాస్వామ్య పోరాటాలలో స్త్రీపురుషుల సమాన హక్కుల కోసం పోరాడతారు. ఇది తప్పు. సమాజ నాశకం.” ఇది నాజి సూత్రం. అబ్బాయిలకు ఉక్కుమనస్సు, హింస, పురుష గుణాలతో ఉండమని నేర్పుతారు. అమ్మాయిలకు మంచి తల్లులు కావాలని, స్వచ్ఛ ఆర్యన్‌ రక్తం గల పిల్లలను పెంచాలని బోధిస్తారు. వారు స్వచ్ఛ జాతిని కాపాడాలి. యూదులకు దూరంగా ఉండాలి. స్త్రీలు మగాళ్ల కార్య ప్రపం చంలో జోక్యం చేసుకోరాదు. ఇంటిని చూసు కోవాలి. పిల్లలకు నాజి విలువలను నేర్పాలి. ఆర్య సంస్కృతి, జాతి వాహకు లుగా మెల గాలి. ”పిల్లలను కనడంలో ప్రకృతి, విధి నిర్ణయిం చినట్లు జాతి పోరాటంలో స్త్రీలను సమ్మిళితం చేశాము. నా రాజ్యంలో తల్లి ప్రధాన పౌరురాలు. నాజి తల్లులందరూ సమానం కాదు. అవాం ఛనీయ జాతిపిల్లలను కన్న తల్లులను శిక్షిస్తాము. వాంఛనీయ పిల్లలను కన్న తల్లులను సన్మాని స్తాము. ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్సనిస్తాము. అంగ ళ్లలో, సినిమా, రైల్వే ఛార్జీలలో రాయితీలిస్తాము. అధిక సంతానవతులకు గౌరవ శిలువలను ప్రదా నం చేస్తాము. నలుగురిని కన్నవారికి కంచు, ఆరు గురి అమ్మలకు వెండి, ఎనిమిది అంతకు మించి కన్న వారికి స్వర్ణ పతకాలను బహూకరిస్తాము.” అని హిట్లర్‌ 1933లో ప్రకటించాడు. ఆశయాలను తప్పిన ఆర్య స్త్రీలను బహిరంగంగా కఠినంగా శిక్షించారు. యూదులు, పోలండ్‌ పౌరులు, రష్య న్లతో సంబంధాలు కొనసాగించిన వారిని గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పులిమి, దేశ గౌర వాన్ని పాడుచేశామని రాసిన అట్టలను మెడలో వేసి ఊరేగించారు. జైళ్ళలో పెట్టారు. ఈ స్త్రీలు ప్రజా గౌరవాన్ని, భర్తలను, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు.
ఆకట్టుకునే నినాద భాషను, మాధ్యమాలను నాజీలు మోసపూరితంగా వాడారు. హింసా ప్రణా ళికలను సంకేత పదాలతో సూచించారు. బొమ్మలు, సినిమాలు, గోడ పత్రికలు, కరపత్రాలతో అనుకూల ప్రచారం చేశారు. ప్రతిపక్షీయులను చీడ తెగులు, పురుగులు, చెదలు, ఎలుకలు, పందికొక్కులు అని తిట్టేవారు. నాజీలే సమస్యలను పరిష్కరించగలరు. మమ్ములనే గెలిపించండన్నారు. మోసపూరిత, ఆకర్షక పద బంధాలు వాడారు. సామాన్య ప్రజలు ప్రపంచాన్ని నాజి కళ్ళతో చూశారు. నాజి భాష మాట్లాడే వారు. హిట్లరే అభివృద్ధిని సాధించగలడని నమ్మేవారు. యూదులను, నాజియేతరులను అసహ్యించుకునేవారు. జర్మన్లందరు నాజీలు కాదు. కొందరు దాడి, చావుకు భయపడకుండా నాజీయిజాన్ని ఎదిరించారు. అధికులు నిరాసక్తిగా ఉన్నారు. పోరాట యోధుడు పాస్టర్‌ నీమొల్లర్‌ జనాల నిశ్శబ్దాన్ని, నిరసన పోరాట రాహిత్యాన్ని ఎత్తిచూపారు. రెండవ ప్రపంచ యుద్ధం మే 1945లో మిత్రపక్షాలకు (ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, యూ ఎస్‌ఎస్‌ఆర్‌, అమెరికా) జర్మని లొంగిపోయింది. శత్రుపక్షాల చేతుల్లో అవమానకర మరణాన్ని ఊహించిన హిట్లర్‌, తన ప్రియురాలు, ప్రచార మంత్రి గోబెల్స్‌, అతని కుటుంబ సభ్యులు తాము దాక్కున్న బంకర్‌ (భూగర్భ రక్షణ గృహం)లో ఏప్రిల్‌లోనే స్వీయ హత్య చేసుకున్నారు.

– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
949020 4545

Spread the love