చికిత్స పొందుతూ వృద్దుడు మృతి

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బోర్గం (కే) గ్రామానికి చెందిన వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇంఛార్జి ఏఎస్ఐ నర్సయ్య బుదవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన తెడ్డు పోషయ్య(70) అనే వ్యక్తి గత నెల 30 వ తేదీన బోర్గం గ్రామం నుంచి మానిక్ బండర్ గ్రామ వైఫ్  వెళుతుండగా చెక్క వద్ద 63వ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళుతున్న బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ డీ కొట్టాడు. వెంటనే క్షేతగాత్రున్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ప్రస్తుతం బోర్గం గ్రామంలో నివశిస్తున్నాడు. మృతుని అన్న కుమారుడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love