అధికారం మనదే… అధైర్య పడకండి

– ఎంఎల్‌ఏ సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-వేంసూరు
కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అధికారం మనదే అని, రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు. శనివారం సాయంత్రం మర్లపాడులో గొర్ల రామ్మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధుతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, ఎన్నికలలో తను గెలుపు ఖాయమని సర్వేలు కూడా అనుకూలంగానే వచ్చాయని అన్నారు. కార్యకర్తలు ఈ 30 రోజులు సైనికుల్లా పనిచేస్తే రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో తరలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, మందపాటి మహేశ్వర్‌రెడ్డి, నాని దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, మారోజు సురేష్‌, కంటే వెంకటేశ్వరరావు, మిర్యాల ప్రసాద్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ సభను విజయవంతం చేయండి
తల్లాడ: మల్లవరం గ్రామంలో శనివారం బిఆర్‌ఎస్‌ పార్టీ మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ నవంబర్‌1న కల్లూరు పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, మండలం నుంచి భారీగా బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీని వాస్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకట శేషగిరిరావు, జడ్పీటీసీ సభ్యురాలు దిరిశాల ప్రమీల, వైరా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భద్రరాజు, రైతుబంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవరా వెంకటలాల్‌, తల్లాడ పట్టణ అధ్యక్షులు జివిఆర్‌ పాల్గొన్నారు.

Spread the love