- Advertisement -
– ఇబ్బందులకు గురివుతున్న తండా వాసులు
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలం ఆన్సాన్ పల్లి గ్రామపరిదిలోగల లంబాడి తండా నుండి గొర్లవీడు గ్రామానికి వెళ్ళు ప్రధాన రహదారి చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారి బురదమయంగా మారింది.దీంతో వృద్ధులు,, చిన్నారులు,ప్రజలు రాకపోకలకు ఇబ్బందులకు గురివుతున్నారు.రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు గ్రామసభల్లో పాలకవర్గానికి,అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,పాలకవర్గం స్పందించి బురదమయమైన రహదారికి మరమ్మత్తు పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యం కలిపించాలని తండా వాసులు కోరుతున్నారు.
- Advertisement -



