నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
“భారతదేశం వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి సామాన్య మధ్యతరగతి ప్రజల గొంతుకలుగా పనిచేస్తాయి. ప్రజలకు, పాలకులకు మధ్య సమాచారాన్ని అందించే వారదులుగా నిలుస్తాయి” అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిట శ్రీహరి అన్నారు. నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్లో నవతెలంగాణ ప్రతినిధి బృందం మంత్రిని కలిసి ఆహ్వానాన్ని అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక ప్రజల హక్కుల కోసం పని చేస్తోందన్నారు. ప్రజల గొంతుకగా పని చేస్తోందన్నారు. పత్రిక మరింత అభివృద్ధి చెందుతూ ముందుకుసాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



