ఎల్లిగడ్డలు ఎత్తుకెళ్లిన దుండగులు

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని  కన్నాపూర్ గ్రామంలో ఒక క్వింటాల్ ఎల్లిగడ్డలు చేన్లో నుండి తెంపుకొని ఎత్తికెళ్ళిన దుండగులు బాధిత రైతు రాత్రి గుండవేని శంకర్ గురువారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు గుండవేని శంకర్ మాట్లాడుతూ, నాకు ఉండబడిన 1 గుంట భూమిలో ఎల్లిపాయలు పెట్టుకున్నాను, బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నా యొక్క ఎల్లిమల్ల ను కోసుకొని ఎత్తుకెళ్లారు. సుమారుగా రూ.40,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Spread the love