ప్రజాస్వామ్యం తనంతట తానుగా స్వేచ్ఛలకు హామీ ఇస్తుందా? లేక ఆ స్వేచ్ఛల కోసం పోరాడాల్సిన అవసరం ఉందా? భారతీయ మీడియాలో ప్రగతిశీల వర్గాల వారు పరిమిత మీడియాను, పరిమిత ప్రజాస్వామ్యం అని విశ్వ సిస్తారు. 2014 లో నూతన ప్రభుత్వ ఏర్పాటు తర్వాత, రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన స్వేచ్ఛల్ని కూడా అనుభవించలేక, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని గడ చిన దశాబ్దం రుజువు చేసింది. ఇది కూడా దేశం లోని జర్నలిస్టులు, విద్యావేత్తలు, కార్యకర్తలకు అత్యంత పరీక్షా సమయాలలో ఒక పరీక్షగా ఉంటుంది.
వ్యక్తుల్ని, జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసుకో వడం కొత్తేమీ కాదు, అయితే ఎమర్జెన్సీ కాలంలో చేసిన విధంగా రాజ్యం పక్షపాత ధోరణితో ఉన్నప్పుడు, అలాంటి లక్ష్యం ఒక భిన్నమైన దక్పథాన్ని తీసుకుంటుంది. అమా యకులపై నేరాలు మోపడం లేక ఆర్థిక నేర్పాల్ని ఆరోపించి అనాగరిక చట్టాల కింద ప్రజల్ని నిర్బంధంలో ఉంచే శిక్ష ప్రక్రియగా మారింది. పాలక పార్టీ మద్దతు లేని అసమ్మతి వాదులు జైలు నిర్బంధంలో లేనప్పుడు అధికారులు, ఏ స్థాయిలో ఉన్నవారినైనా భయపెట్టి లొంగదీసుకుంటారు.
ఈ సంవత్సరం జనవరి నెల మధ్యలో శిక్షణ పొందిన ఒక ఇంజనీర్, కొన్ని పరిస్థితుల కారణంగా మీడియా వ్యక్తిగా మారిన ప్రబీర్ పుర్కాయస్థ వంద రోజుల జైలు నిర్బంధాన్ని పూర్తి చేశాడు. ”న్యూస్ క్లిక్” ఆన్లైన్ న్యూస్ పోర్టల్ సంస్థాపకుడైన పుర్కాయస్థను దేశ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ, చట్ట వ్యతిరేక కార్యక లాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నిర్బంధంలో ఉంచారు. అధికారులు, అతని అరెస్ట్ ద్వారా మీడియాలో ముఖ్యంగా డిజిటల్ మీడియాలో పని చేస్తున్న వారికి హెచ్చరిక చేశారు.
రాజకీయ వేధింపులు, సమాజానికి ప్రమాదం అను కునే వారి కోసం చేసే గాలింపులు (విచ్ హంట్స్) పుర్కా యస్థకు కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర భారతదేశానికి ఉన్నంత వయసున్న 75 ఏళ్ళ జర్నలిస్ట్, లెఫ్ట్ వర్డ్ వారు ప్రచురించిన రచనలో తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించాడు. ఎమర్జెన్సీకి, ప్రస్తుత కాలం లక్షణాన్ని వివరించే ”అప్రకటిత ఎమర్జెన్సీ” గా పిలువబడే ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న సమాంతర రేఖల్ని పుర్కాయస్థ తన మాటల్లో వివరిం చాడు. అప్పుడూ, ఇప్పుడు కూడా అదే నిరంకుశత్వం ఉనికి లో ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల్ని ఉపయోగిం చారు, ఇప్పుడు కూడా వాటిని కేంద్ర ప్రభుత్వం ఉపయో గించుకుంటుంది. అప్పుడు మీడియాలో ఒక పెద్ద విభాగం ఫిర్యాదులు చేసింది, నేడు మీడియాలోని మొత్తం ప్రధాన స్రవంతి కొన్ని ముఖ్యమైన మినహాయింపులు తప్ప.
నాటి ఎమర్జెన్సీ 1.0 మీసా (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంట ర్నల్ సెక్యూరిటీ ఆక్ట్)ను ఉపయోగిస్తే, నేటి ఎమర్జెన్సీ 2.0లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ‘ఊపా’ చట్టాన్ని నేటి ప్రభుత్వం బలోపేతం చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. 2019 చట్టానికి చేసిన సవరణలు, నేరం చేయలేదని రుజువు చేసుకునే భారాన్ని నిందితునిపై మోపుతూ బెయిల్ను నియమం కంటే కూడా మినహాయింపును చేసింది.
ఎమర్జెన్సీని ప్రకటించిన 3 నెలల తర్వాత సెప్టెంబర్ 25, 1975 న జేఎన్యూ విద్యార్థిగా ఉన్న పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు లాక్కొని వెళ్ళారు. అతడు ఓ విద్యార్థి సంఘం కార్యకర్త, జేఎన్యూ విద్యార్థి సంఘంలో విద్యార్థి కౌన్సిలర్గా ఉన్న వ్యక్తికి (తరు వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు) దగ్గరి స్నేహితుడు. ఇది ఒక కిడ్నాప్ కేసు. పోలీసులు విద్యార్థి సంఘ అధ్యక్షుడు డీ.పీ.త్రిపాఠీ కోసం వెతుకుతూ పొరపాటున ప్రబీర్ పుర్కాయస్థను ఎత్తుకెళ్లారు. డీపీటీగా పిలువబడే త్రిపాఠీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి, ఆ తరువాత నేష నలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్య తలు స్వీకరించడానికి ముందు వామపక్ష విద్యార్థి రాజకీయాలకు సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత పోలీసులు త్రిపాఠీని కూడా నిర్బంధించారు.
జేఎన్యూ వామపక్ష రాజకీయాల కోటగా ప్రసిద్ధి చెందింది. ముందు జాగ్రత్త చర్య పేరుతో నిర్బంధాలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు, నిరసనల అణచివేతకు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా క్యాంపస్లో అన్ని వామపక్ష భావాలు గల విద్యా ర్థులు సమ్మెలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించే వారు. క్యాంపస్ లోపలికి పోలీసుల ప్రవేశం అంత తేలికేమీ కాదు. కానీ ఇతర విద్యార్ధుల్ని తరగ తులకు వెళ్ళనీయకుండా కొంతమంది విద్యార్థులు అడ్డు కుంటున్నారనే సాకుతో పోలీసులు క్యాంపస్ లోపలికి ప్రవేశించారు.
ఈ ప్రత్యేక కేసులో నాడు అండర్ గ్రాడ్యు యేట్ విద్యా ర్థినిగా ఉన్న మేనకాగాంధీ ఫిర్యాదుపైనే పోలీసులు క్యాం పస్లోకి ప్రవేశించారు. త్రిపాఠీ అనుకొని పొరపాటుగా అరెస్ట్ చేసినప్పటికీ పుర్కాయస్థ ‘మీసా’ చట్టం కింద సంవ త్సరం పాటు జైలుశిక్ష అనుభవించాడు. అంతేకాక ఆయ నను ఏకాంత కారాగారంలో ఉంచారు. నిర్బంధంలో ఉండ డం ఆయనకిది మొదటి పర్యాయం. సురేంద్రమోహన్ లాంటి సోషలిస్టుల నుండి జనసంఫ్ు సభ్యుల దాకా ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని కలిసే అవకాశం తానకెలా వచ్చిందో తన స్వీయ జ్ఞాపకాలలో వివరించాడు. జన సంఫ్ుకు చెందిన కీ.శే. అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషి లాంటి కొందరు నాయకులు కేంద్ర మంత్రులయ్యారు, కీ.శే.ఓ.పీ.కోహ్లీ లాంటి వారు రాజ్యసభ సభ్యులయ్యారు. తన కార్యకర్తల్ని ముందుగానే విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆర్ఎస్ఎస్ రాయబారాలు, రాజీ ప్రయత్నాల గురించి తన రచనలో పుర్కాయస్థ వివరించాడు.
కొన్ని సంవత్సరాలుగా తన అవగాహనను రూపొం దించిన మొత్తం అనుభవాల్ని ఈ రచన వివరిస్తుంది. సౌకర్యవంతమైన మధ్య తరగతి బెంగాలీ కుటుంబానికి చెంది, తన స్వంత పరివర్తనతో అతని ప్రయాణం ప్రారంభ మైంది. ఆయన ప్రస్థానాన్ని గుర్తించి, ఆయన సభ్యునిగా కొనసాగుతున్న సీపీఎం పార్టీలో కార్యకర్తగా మారడానికి తోడ్పడిన ప్రాపంచిక ఆలోచనల్ని ఈ పుస్తకం బహిర్గతం చేసింది. ”మీరు ఏ చరిత్ర వైపు ఉన్నారో దాని గురించిందే అసలు ప్రశ్న” అని ఆయన రాస్తాడు. ”నైతిక పోరాటం” అంటే ఏమిటి లేక నైతిక పోరాటాన్ని కొనసాగించడం ఎం దుకు అవసరం, ఎవరు నైతిక పోరాటం చెయ్యాలనేది ఆ యన వేస్తున్న కొన్ని ప్రశ్నలు. తనకు వార్తల్లో నిలిచి పోవా లనే కోరిక ఏమీ లేదనీ, ”నైతిక పోరాటం” తనతోనే మొద లై, తనతోనే అంతం కాని విషయం స్పష్టమని ఆయన అంటాడు.
న్యాయం, శాస్త్రీయ విచారణ, సమదష్టి లాంటి లక్ష ణాలు గల వ్యక్తిగా ఆయన పరిణామక్రమాన్ని, వ్యక్తిగత, రాజకీయ జ్ఞాపకాలతో కూడిన ఈ పుస్తకం గుర్తిస్తుంది. పుస్తకం రెండు కాలాల మధ్య ఉన్న తేడాల్ని చూపించిన ప్పటికీ, ”75 ఏళ్ళ లౌకిక, వైవిధ్య, ప్రజాస్వామిక, రాజ్యాంగ నిర్దేశిత భారత గణతంత్ర సందర్భాన్ని” దష్టిలో ఉంచుకో వాల్సిన అవసరం ఉందని పుర్కాయస్థ పేర్కొంటాడు.
హేతువాది నరేంద్ర దభోల్కర్, స్కాలర్ ఎంఎం కాల్బుర్గి, కార్మిక సంఘం నాయకుడు, హేతువాదీ అయిన గోవింద పన్సారే, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ లాంటి వారి హత్యల్ని, భీమా కోరేగావ్ కేసులో ఉపా చట్టం కింద జైల్లో నిర్బంధంలో ఉన్న మేథావులు, కార్యకర్తల అరెస్ట్ను ఆయన గుర్తు చేసుకుంటాడు. హత్యకు గురైన వారు, నిర్బంధంలో ఉన్నవారు వారివారి మార్గాల్లో నిరసించే ప్రజాస్వామిక హక్కు, హేతుబద్ధత కోసం నిలబడి, ప్రతి ఘాత, మతవాద, మితవాద హిందూత్వను సవాల్ చేశారు. ఈ మితవాద ఆధిపత్య కాలంలో గోరక్షణ పేరుతో, మతాం తర వివాహాలు చేసుకునే వారిపై, మైనార్టీలపై జరుగు తున్న దాడులు వారి చర్యల్లో భాగమయ్యాయి.
పుర్కాయస్థ ‘న్యూస్ క్లిక్’ను 2009 లో ప్రారంభిం చాడు కానీ దానిని ఒక ప్రత్యేకమైన సంస్థగా భావించలేదు. ఇతర కొన్ని డిజిటల్ వేదికలు, ప్రధాన మీడియా స్రవంతి వలె ”ప్రజలపై దాడులు, జీవనోపాధి, హేతుబద్ధత” కు ముప్పు వాటిల్లినపుడు ప్రతిస్పందనగా వచ్చిన ప్రజల నిరసనల్ని న్యూస్ క్లిక్ కూడా ప్రపంచానికి తెలియ జేస్తుంది. ఈ సంఘటనల్లో అనేకం రచయితలు, కళాకా రులు, విద్యావేత్తలు, మేథావి వర్గానికి చెందిన ఇతరుల్ని వారి సురక్షిత వలయాల నుండి బయటకి వచ్చే విధంగా ప్రోత్సాహించాయి. పుర్కాయస్థ భాగస్వామిగా ఉన్న శాస్త్ర విజ్ఞాన రంగం కూడా తన వంతు పాత్రను పోషించింది.
న్యూస్ క్లిక్, ప్రధాన స్రవంతి మీడియా అందించని నివేదికలు, అభిప్రాయాల్ని కూడా అందించింది. మీడియా లో కొన్ని రకాల నివేదికలు, బహుశా మీడియా వర్గ లక్ష ణాన్ని ఉద్దేశపూర్వకంగా మినహాయించడం గురించి వివ రిస్తూ, ”కార్మికులు నగరంలో ప్రదర్శనలు చేస్తుంటే, ఆ కార్మికుల డిమాండ్ల గురించి కంటే కూడా ఆ ప్రదర్శ నల వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ గురించి వార్తలు ఎక్కు వగా రాస్తుండడం తాను గమనించానని పుర్కాయస్థ పేర్కొంటాడు.
ఇంతకుముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రధాన స్రవంతిలోని కొన్ని మీడియా వర్గాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్-19 వల్ల సంభవించిన అదనపు మరణాల గురించి నివేదిం చాయి, దానికి ప్రతి ఫలంగా, తమ కార్యాలయాలపై ఆదాయ పన్నులశాఖ దాడులతో అవి భారీ మూల్యాన్ని చెల్లించాయి.
ఈ పుస్తకంలో 7 అధ్యాయాలు, 2 అనుబం ధాలు, లలితా రామ్దాస్ ముందుమాట ఉన్నాయి. పుర్కాయస్థ ఈ పుస్తకాన్ని రచిస్తున్నప్పటికే మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద న్యూస్ క్లిక్పై రెండు పర్యాయాలు దాడులు జరిగాయి. ఆరోపణలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. అక్టోబర్ 3, 2023న పుర్కాయస్థ తన సహచరునితో సహా అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ను కూడా కోర్టులో సవాల్ చేశారు. రెండు వారాల అనంతరం, న్యూస్క్లిక్ సిబ్బంది జీతాల్లేకుండా ఉండే విధంగా కంపెనీ ఖాతాల్ని స్తంభింప చేశారు.
పదేపదే తన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన తరు వాత పుర్కాయస్థ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయనకు అనా రోగ్య సమస్యలున్నాయి కానీ ఆయన స్ఫూర్తి మాత్రం చెదరలేదు. న్యూస్ క్లిక్ సంస్థ నిధుల్ని స్తంభింపజేసినప్పటికీ కూడా వార్తల్ని అందించే పనిని కొనసాగిస్తూ ఉంది. న్యూ ఢిల్లీలోని ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియాలో పుస్తకాన్ని ఆవిష్కరిం చిన రోజున, హాలు స్నేహితులు, సహచరులు, సానుభూతి పరులతో నిండిపోయింది.
పుర్కాయస్థ తెలిసిన వారందరికీ ఆయన చమత్కారం గురించి తెలుసు. ఆయన రచనలో ఉదారమైన మోతా దులో భారత ప్రజలపై తప్పు పట్టలేని విశ్వాసం కనిపి స్తుంది. ప్రస్తుత సమయంలో దాడి తీవ్రత ఎక్కువగా ఉంటే అదే స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటుంది. 1977 ఎమ ర్జెన్సీ తిరస్కరణలో సాధారణ ప్రజలే ప్రధాన పాత్రధా రులు. ”నాయకులు, అనుమతించిన దానికి మించి వ్యవహ రిస్తే అదే ప్రజలు నాయకులకు తగిన గుణపాఠం చెప్తా రని” ఆయన అన్నాడు.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
– టీ.కే.రాజ్యలక్ష్మి