పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము: ఎంపీపీ గజ్జల సాయిలు

నవతెలంగాణ – మిరుదొడ్డి
పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీపీ గజ్జల సాయిలు , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల రాజేశంలు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని మీరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో మాజీ సర్పంచ్ కిష్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని తెలపడం జరిగిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుట్టల్, హర్షద్, కనకరెడ్డి, చింటూ సామెల్, రాజు సిరియాల తదితరులు  పాల్గొన్నారు.

Spread the love