జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

– ఈనెల 16 వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు: హెచ్.ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 03 నుండి 13 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పరీక్షలు నిర్వహణా విభాగం నిర్ణయించిందని స్థానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హరిత తెలిపారు. సోమవారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 16 వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని,పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు ఏ ఏ సబ్జెక్టులు తప్పా రో వాటికి పని వేళల్లో పాఠశాల కు వచ్చి చెల్లించాలని కోరారు.
Spread the love