ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా రఘునందన్ రావు గెలుపు ఆపలేరు

– మాజీ ఉపసర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన రఘునందన్ రావు గెలుపు ఆపలేరని మాజీ ఉపసర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుడికందుల గ్రామంలో భైరవ స్వామి దేవాలయం లో రఘునందన్ రావు గెలుపు కోసం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడు తూ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని అన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహింహిస్తున్న సందర్భంగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుం దన్నారు. మా గ్రామం నుండి అధిక మెజార్టీ సాధిం చి రఘునందన్ రావుకు గిఫ్టుగా ఇస్తామన్నారు.  గతంలో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది న అలుపెరుగని నాయకునిగా, ఎంపీ అభ్యర్థిగా మెదక్ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండే నాయకుడన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో ప్రజలు రఘునందన్ రావు గెలుపు కోరుకుంటు న్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాపరెడ్డి, మహేందర్ రెడ్డి, చంద్రా రెడ్డి, ఉప్పర్ స్వామి, ఉప్పరి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎం ఎల్లయ్య, చింత మోహన్ రెడ్డి, ఉప్పరి రాజేష్, బోయిని శ్రావణ్, గురుట రవీందర్ రెడ్డి, బైరారెడ్డి, అనిల్ రెడ్డి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love