మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ సాధించిన విజయాలు, పురోగతిపై రూపొందిస్తున్న డాక్యుమెంటరీపై శనివారం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్ అండ్ బీ కార్యదర్శి కె. శ్రీనివాసరాజు, ఈఎన్సీలు ఐ. గణపతిరెడ్డి, రవీందర్రావు, సి.ఈసతీష్, మధుసూధన్ రెడ్డి, డి.సి దివాకర్, పలువురు అధికారులు, డాక్యుమెంటరీ రూపొందించే సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎంతో దూర దష్టితో, భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా రోడ్లు భవనాలు శాఖ ద్వారా ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారని అన్నారు. అందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ అధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మాణమైన భవనాలు, రోడ్లు, బ్రిడ్జిలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రతిష్టాత్మకం అయ్యాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం ఆర్ అండ్ బీ పరిధిలో 30లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలు ఉన్నాయనీ, ఈ తొమ్మిది ఏండ్ల కాలంలో కొత్తగా కోటి చదరపు అడుగుల భవనాల సముదాయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రూ. 139 కోట్ల నిధులతో 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల్లో దేశమే అబ్బుర పడేలా 1650 కోట్లతో జిల్లా సమీకత కార్యాలయ భవనాలు నిర్మించామని తెలిపారు. తెలంగాణ ప్రజలు గర్వించేలా సకల హంగులతో రాష్ట్ర రాజధానిలో రూ. 617 కోట్లతో సచివాలయ భవనం నిర్మించుకున్నామన్నారు. అదే విధంగా హైదరాబాద్లో రూ. 585 కోట్ల తో 20 అంతస్థుల పోలీస్ కమిషనరేట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. రూ. 146.50 కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ప్రపంచంలోనే ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు రూ.177 కోట్లతో లుంబినీ పార్క్ సమీపంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిత్యం స్మరించుకునేలా అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 30 కోట్లతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, మైనార్టీ అనాథ చిన్నారుల కోసం హైదరాబాద్ నాంపల్లిలో రూ. 39 కోట్ల వ్యయంతో అనీస్ – ఉల్ – గుర్బా నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు గత 60 ఏండ్లల్లో నిర్మించిన వాటికంటే ఈ తొమ్మిది ఏండ్లల్లో రెట్టింపు అయ్యాయని తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, రాజధాని నాలుగు లైన్ల రోడ్డు ప్రణాళిక ప్రకారం రికార్డు సమయంలో రోడ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో పూర్తి ఉచితంగా అందజేస్తున్న మన్నారు. 30 ఏండ్లుగా పేదలకు గహ నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారో, అంతే ఖర్చు కేవలం తొమ్మిది ఏండ్లల్లో చేశామనీ, అంతేగాక రూ.1000 అదనంగానే ఖర్చు చేశామని అన్నారు.