తెలంగాణలో మూడు రోజులు వానలు

నవతెలంగాణ – హైదరాబాద్:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, మెదక్, జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.

Spread the love