రైలు ఎక్కుతుండగా జారిపడిన ముగ్గురు ప్యాసింజర్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ముగ్గురు ప్యాసింజర్లు జారిపడ్డారు. ట్రైన్ నుంచి జారిపడిన వారిలో అనకాపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన అల్లం శంకర్, చోడవరంకు చెందిన జనపరెడ్డి దాక్షాయిని, అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ ఉన్నారు. వీరిలో అల్లం శంకర్, దాక్షాయినిల పరిస్థితి సీరియస్‌గా వుండటంతో వైజాగ్‌కు తరలించారు. మరో ప్రయాణికురాలు అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి నుంచి తాడేపల్లిగూడెంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా ఘటన చోటు చేసుకుంది.

Spread the love