రాహుల్ గాంధీ కారుపై దాడి..

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది. షెడ్యూల్‌లో ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు.

Spread the love