తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం: ఎమ్మెల్యే

నవతెలంగాణ – నూతనకల్
ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమని తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎన్నికల సరళిని పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు , ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల పట్టభద్రులు ఆకర్షితులై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే హామీలను అమలు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి నాయకులు చురుకంటి చంద్రారెడ్డి పగిళ్ల అశోక్ రెడ్డి గోరుగంటి రామకిషన్ రావు బొడ్డుపెళ్లి అంజయ్య కట్ట మల్లారెడ్డి జట్టంగి గణేష్ దరిపల్లి వీరన్న, ఉప్పుల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love