నేడు జన జాతర భారీ బహిరంగ సభ

– కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం
నవతెలంగాణ-పినపాక
మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నేడు జరిగే జన జాతర సభకు భారీగా తరలిరావాలని కాంగ్రెస్‌ శ్రేణులకు, ప్రజలకు కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు రామనాథం పిలుపునిచ్చారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌ రోడ్‌లో గల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ ఎంపీ అభ్యర్థిగా తమ నామినేషన్‌ను కలెక్టరేట్‌లో సమర్పిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సభకు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గట్ల శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీను, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు, పాల్గొన్నారు.

Spread the love