హైదరాబాద్​లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్
త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలోప్రత్యేక ప్రార్ధనలు ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రార్ధనలకు సుమారు 30,000 మంది హజరయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్​ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. బహదూర్‌పురా క్రాస్‌ రోడ్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. జూపార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

Spread the love