ఘోర విషాదం..కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. దాదాపు 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కలకలం సృష్టించింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సముద్ర తీరంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో బాధితులు మద్యం తాగారని.. అనంతరం ఇంటికి వచ్చి స్పృహ కోల్పోయారని పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బాధితుల్లో కొంత మంది చికిత్స పొందుతూనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.

Spread the love