తాడిచెర్లలో విషాదం

– పెంజేరువులో పడి ఇద్దరు బాలురు మృతి
– కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో బొంతల రాజు- అనూష దంపతులకు చెందిన బొంతల అరుణ్ (12) బొంతల కార్తీక్ (10) ఇద్దరు చిన్నారులు మధ్యాహ్నం 2 గంటలకు మేకలను మెపెందుకు ఊరి చివరకు వెళ్లి ప్రమాదవశాత్తు పెంజేరువులో పడి మృతి చెందారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చాయి. చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వెతుకుతుండగా, చెరువు ప్రక్కన చెప్పులు కనిపించడంతో చెరువులో చిన్నారుల మృతదేహాలు కనిపించినట్లుగా వాపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాటారం సీఐ నాగార్జునరావు, కొయ్యుర్ ఏఎస్ఐ కుమారస్వామి తోపాటు పోలీసులు సంఘటన స్థలానికి చేరులోని ప్రమాదానికి గలా కారణాలను విచారిస్తున్నారు. కాగా అరుణ్ 6వ, కార్తీక్ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన శ్రీనుబాబు:  తాడిచెర్లలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ ఐటి,పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు తో కలిసి చెరువులో పడి మృతిచెందిన  చిన్నారుల మృత దేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అదైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
Spread the love