విషాదం.. బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: బొల్లారంలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి చెందారు. సంగారెడ్డి IDA బొల్లారంలోని లక్ష్మి నగర్ కాలనీలో బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి చెందారు. బిల్డింగ్ మూడో అంతస్తు పిట్ట గోడకు ఆనుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు దీపాకర్ అనే వ్యక్తి. అయితే… ఒక్కసారిగా ఆ పిట్టగోడ కూలి పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై పడిపోయాడు దీపాకర్. అయితే రేకుల ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తల్లో భర్త జయదేవ్ స్పాట్ లొనే మృతి చెందాడు, భార్య సబిత, కొడుకుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love