ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

నవతెలంగాణ- అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విస్నన్నపేటలో బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నూజివీడు వెళ్లే దారిలో రాణి కల్యాణ మండపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love