ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. కుహక్‌మెట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పుల్లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Spread the love