Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌

హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌

- Advertisement -

– బేగంపేట లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో తాత్కాలిక ఏర్పాట్లు
– ఫ్యూచర్‌సిటీ ఎడ్యుకేషన్‌ జోన్‌లో శాశ్వత ప్రాంగణ నిర్మాణం
– సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం దిశగా కీలక పరిణామం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో విద్యావ్యాప్తి కోసం గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. నగరంలో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ ను ప్రారంభించనున్నట్టు లండన్‌ వర్సిటీ ప్రకటించింది. హైదరాబాద్‌లోని బేగంపేట్‌ లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌లో తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నగరంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఎడ్యుకేషన్‌ జోన్‌లో శాశ్వత ప్రాంగణం నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. తెలంగాణను వరల్డ్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం దిశగా కీలక పరిణామం జరిగింది. హైదరాబాద్‌ను ఎంచుకున్న తొలి అంతరా ్జతీయ విశ్వవిద్యా లయంగా చరిత్రలో యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ నిలవనుంది. యూకేలోని కింగ్స్‌ కాలేజ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అను బంధ కళాశాలలుగా ఉన్నాయి. తెలంగాణను అన్ని రంగాలకు తగినట్టుగా నిలిపేందుకు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ మధ్య కాలంలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. రాబోయే రెండేండ్ల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థల ఆఫ్‌-షోర్‌ క్యాంపస్‌లతో కూడిన ఒక నాలెడ్జ్‌ హబ్‌ను భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగనుంది. పరిశోధనా సంస్థలు, సాఫ్ట్‌వేర్‌, బయోటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. వాటివల్ల యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. 2027లో విద్యా కార్యకలాపాలను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ ప్రతిని ధులు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. త్వరలో మరిన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాల యాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉన్నది. యూకేకి చెందిన 13పాఠశాలలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యూకే ప్రభుత్వాధి కారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -