- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ నుండి హైదారాబాద్ వైపు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ నుండి హైదారాబాద్ కు ఓ కుటుంబ సభ్యులు తమ గృహోపకరణాలను వాహనంలో తరలిస్తున్నారు. తోటపల్లి శివారులో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గృహోపకరణాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
- Advertisement -



