- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పీగా ఎం వెంకట రామయ్యను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్పి లను బదిలీలు చేస్తూ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ కి డీఎస్పీగా ఎం వెంకట్రామయ్యను కేటాయించారు. ఇప్పటివరకు బైంసా ఎఎస్పీ పత్తిపాక సాయికిరణ్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ట్రిపుల్ ఐటీ కి రెగ్యులర్ డిఎస్పి నియమించడంతో భద్రత మరింత మెరుగుపడనుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



