మృదురాలి కుటుంబాన్ని పరామర్శ

– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
– మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామంలో నాయిని శ్రీపాల్ రెడ్డి తల్లి ఉషా దేవి ఇటీవల మృతిచెందగా ఆమె కుటుంబాన్ని సందర్శించి పరామర్శించే కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు ఆపాటి మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆమె పార్ధవదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. నేనాల గ్రామ అభివృద్ధి కోసం ఆమె ఎంతో సేవ చేశారని అన్నారు అలాంటి గొప్ప వ్యక్తి నేడు మృతి చెందడం గ్రామానికి తీరని లోటు అని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని రంగాలుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆ గ్రామ ఎంపీటీసీ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య సి.బి.ఐ జిల్లా నాయకుడు విజయ సారధి రెడ్డి సలగు పూర్ణచందర్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ క్రాంతి రెడ్డి వీరన్న నాగరాజు తో పాటు మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Spread the love