మంచిప్ప గ్రామంలో ఘనంగా వివేకానంద జయంతి

నవతెలంగాణ  – మోపాల్
శుక్రవారం రోజున మంచిప్ప గ్రామంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 162 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంచిప్ప గ్రామంలోని వివేకానందుల వారి విగ్రహం వద్ద యువజన సంఘం సభ్యులు పూలమాలలు వేసి, కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం గ్రామంలోని స్కూల్లో వివేకానందుని క్యాప్సిల్స్ అనే పుస్తకాన్ని విద్యార్థినీ విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు కోమటి రాము, కర్ల సుభాష్ సర్పంచ్ సిద్ధార్థ, ఉప సర్పంచ్ జగదీష్, కోఆప్షన్ అజీమ్ ,విడిసి పెద్దలు సాయి రెడ్డి, మైసయ్య ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love