- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో ఏర్పాటు చేసిన మందుపాతరల (మైన్ల)న్నింటినీ అమెరికా నౌకాదళం పూర్తిగా తొలగించిందని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇకపై ఇరాన్ గనుక కొత్తగా మందుపాతరలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఆ నౌకలను వెంటనే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. హర్మూజ్ మార్గంలో మైన్ల ఏర్పాటుపై ఎలాంటి మినహాయింపులు లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అమెరికా స్పేస్ ఫోర్స్ ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.
- Advertisement -



