20 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఆలస్యంపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా సోమవారం స్పందించారు. ‘ఖజానాలో డబ్బులపై అంచనా లేకుండా నే రుణమాఫీ ప్రకటన చేశారా? లక్ష రూపాయల రైతు రుణమాఫీ కేవలం ప్రకటనలకే పరిమితమా? లేదా ఎన్నికల స్టంటా? .రాష్ట్రంలో 36.68 లక్షల మంది రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.7,753 కోట్లు మాత్రమే. రుణమాఫీ జరిగింది 16 లక్షల మంది రైతులు మాత్రమే. మిగతా 20 లక్షల మంది రైతులకు రూ.11,445.95 కోట్లు ఎప్పుడు విడుదల చేస్తారు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Spread the love