మండలంలో విస్తృతంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

– ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్
– బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్
నవతెలంగాణ – కొత్తూరు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వారు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో సీనియర్ నాయకులు వడ్డే బాలయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ హవా మొదలైందని పార్లమెంట్ గడ్డపై బీఆర్ఎస్ జండా ఎగరవేస్తామని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పెంట నోళ్ల యాదగిరి, మేక గూడా పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం నరసింహారెడ్డి,  బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, నల్ల వోలు నరేందర్ రెడ్డి, దేశాల భీమయ్య, జంగ గళ్ళ శివకుమార్, పంపులు నరసింహ గౌడ్, వడ్డే మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love