చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత

నవతెలంగాణ – కొత్తూరు

చేపల వేటకు వెళ్లి ఇద్దరూ మృత్యువాత పడిన సంఘటన మండలంలోని గూడూరు గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్త గూడ గ్రామానికి చెందిన ఎలగని కిష్టయ్య  గౌడ్ (59) వడ్డే వెంకటేష్ (43) మంగళవారం రాత్రి పొద్దు పోయాక చేపలు పట్టేందుకు గూడూరు గ్రామం రెవెన్యూ పరిధిలో గల ఉప్పరోని కుంట చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయారు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడం కుటుంబ సభ్యులు చెరువు దగ్గర కు వెళ్లి చూడగా అందులో మునిగి చనిపోయి ఉంటారని గుర్తించారు. గ్రామస్తులు మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Spread the love