- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో మూగజావాలతోపాటు,ప్రజలు దాహార్తికి అల్లాడుతున్నారు. ప్రజల,బాటసారుల,పుష్కరాలకు వెళుతున్న ప్రయాణికుల దాహార్తి తీర్చిడానికి శనివారం మండలం కొయ్యుర్లో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, బొమ్మ రమేష్ రెడ్డి,మహేందర్ రెడ్డి,కొండూరి మమత,మల్లేష్,లచ్చయ్య,సమ్మిరెడ్డి,రాజ సమ్మయ్య,శ్రీనివాస్,బత్తుల మల్లయ్య,మల్లేష్,శ్రీనివాస్,అశోక్,రమాదేవి పాల్గొన్నారు.
- Advertisement -



