మహిళల టీ20 విజేత ముంబయి

ఫైనల్లో ఉత్తరాఖాండ్‌పై గెలుపు– ఫైనల్లో ఉత్తరాఖాండ్‌పై గెలుపు
ముంబయి :
దేశవాళీ సీనియర్‌ మహిళల టీ20 టోర్నమెంట్‌ విజేతగా ముంబయి నిలిచింది. శనివారం రారుపూర్‌లో జరిగిన ఫైనల్లో ఉత్తరాఖాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబయి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. సీనియర్‌ ఉమెన్స్‌ టీ20 ట్రోఫీని అత్యధికంగా రైల్వేస్‌ 11 సార్లు గెల్చుకుంది. టైటిల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు పి నాయక్‌ (3/14), దాక్షిణి (2/8), ఫాతిమా జాఫర్‌ (2/13) ఉత్తరాఖాండ్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌, కెప్టెన్‌ జెమీమా రొడ్రిగస్‌ (30 నాటౌట్‌), హుమైరా (23), సయాలి (10 నాటౌట్‌) రాణించారు.

Spread the love