అదానీ గ్రూపుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌ వేసిన పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఈ నెల 17న విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆమె తరుపు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలు అందుకు అంగీకరించారు. తొలుత దీనిని ఈ నెల 24న విచారిస్తామని కోర్టు పేర్కొన్నగా.. ఇదే విషయంపై మరో రెండు పిటిషన్లు 17న విచారణకు రానున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొన్న న్యాయస్థానం ఈ పిల్‌పైనా అదే రోజున విచారణ జరుపుతామని తెలిపింది.

Spread the love