ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ తత్కాల్‌ ఫీజు గడువు మార్చి 4

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తత్కాల్‌ ద్వారా ఫీజు చెల్లింపు గడువు వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) డైరెక్టర్‌ పివి శ్రీహరి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ లేదా మేలో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు రూ.500, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు రూ.వెయ్యి తత్కాల్‌ ఫీజుతోపాటు వార్షిక ఫీజును కూడా చెల్లించాలని కోరారు.

Spread the love